ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పెట్టుబడిదారులకు వేగవంతమైన అనుమతులు, మెరుగైన మౌలిక వసతులు, అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆకర్షించడంలో అనుభవం, విశ్వసనీయత రాష్ట్రానికి బలంగా మారుతున్నాయని లోకేశ్ వివరించారు. పెద్ద కంపెనీలతో చర్చలు జరిపి ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకురావడంలో నాయకత్వం కీలకమని చెప్పారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *